TODAY SPECIAL - సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ 550 వ జయంతి ప్రత్యేకం.....

సిక్కు మతాన్ని స్థాపించిన  గురునానక్ దేవ్ 550 వ జయంతి ప్రత్యేకం.....

సిక్కు మతాన్ని స్థాపించిన  గురునానక్ దేవ్ 550 వ జయంతిని పురస్కరించుకొని  యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్( యునెస్కో) గురునానక్ యొక్క  రచనలను అనువదించి, ముద్రించనున్నారు.

గురునానక్  సిక్కు మతంలో మొట్ట మొదటి గురువు.

అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ గుర్బాని అంటే వివిధ సిక్కు గురువుల రచనలు మరియు గురు గ్రంథ సాహిబ్ లోని రచనలను దేశం లో వివిధ భాషల్లో ముద్రించనున్నారు.

గురునానక్ 550వ జయంతి  సందర్భంగా భారతదేశం లో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు

పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలోని  డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు  కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం. గురుద్వార్ దర్బార్ సాహెబ్  కర్తార్పూర్ అనేది రావి నది ఒడ్డున కలదు. గురు నానక్ 18 సంవత్సరాలు ఇక్కడ గడిపారు.

స్మార్ట్ సిటీ నిర్మాణాల కింద sultanpur lodhi  పట్టణం అభివృద్ధి (గురునానక్ వివాహం ఈ పట్టణం లో జరిగింది)

Sultanpur lodhi  రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం.

నాణేలు మరియు  స్టాంపులు విడుదల

centre for inter faith studies(వివిధ మతాలవారు పాల్గొనే మత కార్యక్రమాలు) ని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ లో ఏర్పాటు చేయడం.
గురు నానక్ దేవ్ (Guru Nanak)